విశాలాంధ్ర -జె ఎన్ టి యు ఏ: జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలకు పూర్వ విద్యార్థులు పట్టుకొమ్మలాంటి వారిని యూపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఆచార్య వై. వెంకట రామి రెడ్డి,రిజిస్ట్రార్ ఆచార్య సి.శశిధర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ .వి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం 1994-98 సంవత్సరం లో సివిల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థులుతో కలసి ఎన్టీఆర్ ఆడిటోరియంలో సమ్మేళన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
పూర్వ విద్యార్థుల సలహాలు సూచనలు, అల్యూమిని అసోసియోషన్ బలోపేతానికి దోహదపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సి.శశిధర్ మాట్లాడుతూ.. కళాశాల విజ్ఞానం, పరిశోధన, జీవిత పాఠాలును నేర్పి ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగే వికాసాన్ని అందించింది అన్నారు.జేఎన్టీయూఏ విద్యార్థులు వివిధ దేశాలలో సేవలను అందిస్తుంది.. ప్రపంచ ప్రగతిలో చేయూతను అందించడం.. విశ్వవిద్యాలయ కీర్తిని ఇనుమడింప చేస్తున్నారని అన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ వి సత్యనారాయణ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల మేదో సంపత్తి, ఉపాధి కల్పన, కళాశాల అభ్యున్నతకు చేయూత, నైపుణ్య శిక్షణకు , నూతన సాంకేతిక విజ్ఞాన ఆలోచనలు అమలు, పరిశోదాత్మక అధ్యయన అంశాలను అందించి ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రగతికి బాటలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్యూమిని డైరెక్టర్ ఆచార్య పి. సుజాత , సి. శోభ బిందు , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఇ. అరుణ కాంతి , ఆచార్య యస్. కృష్ణయ్య , ఆచార్య హెచ్. సుదర్శన్ రావు , డాక్టర్ జి. మమత , డాక్టర్ కే.యఫ్. భారతి , డా. శ్రీమతి అజిత , డాక్టర్ కళ్యాణి రాధా , మాజీ ఆచార్యులు వి. శంకర్ , పి.డి. ఆచార్య బి. దిలీప్ , పూర్వ విద్యార్థులు మల్లికా రెడ్డి , శ్రీ మనీష్ పంపత్వార్ , (డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్), శ్రీ సాయి కిరణ్ (సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్), శ్రీ కిరణ్ నల్లగొండ (సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్), శ్రీ రామకృష్ణ భరద్వాజ్ (వ్యవస్థాపకుడు , వ్యవస్థాపకుడు)శ్రీ బి. ప్రసాద్ , శ్రీ ఎన్. సతీష్ , శ్రీ వి. చంద్ర మౌళి , శ్రీ యల్. హరి , శ్రీ బి. మిథున్ గోపాల్ , భోధన, భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.