. లక్షల రూపాయల ఫీజులు దోపిడీ
. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే పది రెట్లు
. ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ సస్పెండ్ చేయాలి
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ : అనంతపురం జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నారాయణ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు .ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఓబులేష్ ,ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పృద్వి, బీసీ .ఎస్సీ. ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు పదివేల నుంచి 15వేల రూపాయల పైన్ అమ్ముతున్నారని తెలిపారు. దోపిడీపై జిల్లాలో ఉన్న ఆర్ఐఓ కి అనేకసార్లు వినతి పత్రాల , ఆందోళన కార్యక్రమాల , ఆధారాలతో సహా అందజేసిన, కనీసం నారాయణ విద్యాసంస్థల పైన కానీ అనంతపురం నగరంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలపై పరిశీలించకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూ ఉన్నారన్నారు. నారాయణ విద్యాసంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న ఆర్ఐవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పుస్తకాలు అమ్ముతున్నారని సమాచారాన్ని ఇచ్చిన ,కనీసం విద్యార్థి సంఘాల నాయకుల ఫోన్లు లిఫ్ట్ చేయరు. నారాయణ విద్యాసంస్థల పైన జిల్లా ఆర్ఐఓ కి ఎందుకు అంత ప్రేమని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రూపులు కాకుండా ఎంపీసీ బైపీసీ లో ఎంసెట్ జెడ్ ఎఫ్ టి బి ఐ సి కోస్పార్క్ సూపర్ చైనా అంటూ రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుకు ఒక్కొక్క ఫీజు నిర్ణయించుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బులను జలగల్లాగా పీల్చుకో తింటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను జిల్లాలో ఏ విద్యాసంస్థలలోనూ అమలు చేయలేదని మండిపడ్డారు.. తక్షణమే రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు స్పందించి కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న ఆర్ఐవో వెంకటరమణ నాయక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజునాథ్ వంశీ ఆనంద్ పవన్ హర్ష కార్తీక్ ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దు గిరి సూర్య శివ ప్రకాష్ పాల్గొన్నారు.