మొన్నటి వరకు ఎండలు, హై టెంపరేచర్తో దేశ రాజధాని అల్లాడిపోయింది. ఎండలు తగ్గి వాతావరణం చల్లబడటంతో హస్తిన వాసులు సంబరపడ్డారు. ఆ ఆనందం కొన్ని రోజులే.. ఆ తర్వాత ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని ప్రజల బాధ వర్ణణాతీతం. నిన్నటి వరకు ఉక్కపోత.. ఇప్పుడు వర్షం తీసుకొచ్చిన వరదతో ఇబ్బంది పడుతున్నారు.
ఆరుగురి మృతి..
భారీ వర్షం కారణంగా ఢిల్లీలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. రోడ్లు, వీధులు తేడాలేకుండా వర్షపు నీటితో కలిసిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్పాస్లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది..