మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం:: ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ప్రభుత్వం చే పంపబడిన పెన్షన్లను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులచే పెన్షన్ దార్ల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులలో అర్హులైన 18,502 మంది పెన్షన్ దారులకు రూ. 12 కోట్ల 79 లక్షల 24 వేల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పెన్షన్ దారుణకు నూతన ప్రభుత్వం వారు ఏప్రిల్, మే, జూన్ నెలలకు అదనంగా వెయ్యి రూపాయలతో మూడు నెలలకు మూడు వేల రూపాయలు, జులై నెలలో నాలుగు వేల రూపాయలు వేరసి 7000 రూపాయలను ప్రతి పెన్షన్ దారుణకు అందించడం జరుగుతుందని తెలిపారు. నువ్వు కూడా సచివాలయం వద్దకు రాకూడదని, తమ ఇళ్ల వద్దకే మా సచివాలయ ఉద్యోగులు వచ్చి మీ పెన్షన్ను అందజేస్తారని తెలిపారు. జూలై 1వ తేదీన నూరు శాతం పంపిణీ పూర్తి కావాలని, అనివార్య కారణాల వలన పంపిణీ ఆలస్యమైతే జులై రెండవ తేదీలో పంపిణీ చేస్తారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పెన్షన్ దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.