-ఎంపీడీఓ గీతావాణి
విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఈనెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ద్వారా మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశామని ఎంపీడీఓ గీతావాణి తెలిపారు. ఆదివారం రాప్తాడు మండల కేంద్రంలో తహశీల్దార్ టి.సీతారాం, సర్పంచ్ సాకే తిరుపాలు, టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా వృద్ధాప్య వితంతు వికలాంగ ఇతర పెన్షన్లు మొత్తం 6398 మంది ఉండగా రూ.4,27,51,000 నగదును లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. అర్హులై ఇదివరకు పింఛన్లు పొందుతున్న ప్రతి ఒక్కరికీ పెంచిన మొత్తం నెలకు రూ.4వేల వేలతో పాటుగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ హామీ ప్రకారం ఏప్రిల్ నెల నుండీ పెంచిన మొత్తం నెలకు రూ.1000 ప్రకారం మొత్తం మూడు నెలలకు రూ.3000వేలతో కలిపి వృద్దాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేశామన్నారు.