మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణ పరిశుభ్రతలో శానిటరీ ఉద్యోగులు సిబ్బంది యొక్క సేవలు మరుపు రానివని, వీరి సేవలు అమోఘ్యము అని మున్సిపల్ కమిషనర్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ సెక్షన్లో మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిలవర్తిస్తున్న సుబ్బరాయుడు పదవీ విరమణ గావించబడ్డారు. పదవీ విరమణ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అభినందన ఆత్మీయ సభను కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో సూచి శుభ్రత విషయంలో సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు చేస్తూ శుభ్రత పట్ల ఎంతో కీలకపాత్ర వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించుటలో కూడా వారి పాత్ర అమోఘమైనదని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా వారు చేసిన విధులు మరుపు రానివని వారు తెలిపారు. ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందడం సంతోషము బాధాకరంగా ఉంటాయి, కానీ తన ఉద్యోగంలో చేసిన మంచి పనులు ప్రజలు తోటి ఉద్యోగస్తులు అధికారులు గుర్తుంచుకుంటారని తెలిపారు. మనం చేసే ప్రతి పనిని దైవంగా భావించి బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించినప్పుడే మంచి గుర్తింపును పొందడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం నాగరాజును, సుబ్బరాయుడును కమిషనర్ రామ్ కుమార్ తో పాటు అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ ఆనంద్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సన్, కేశవ, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సచివాలయ కార్యదర్శులు, కార్యాలయ శానిటరీ ఉద్యోగస్తులు, పదవీ విరమణ పొందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.