హాకీ విజేత తిరుపతి జిల్లా జట్టు
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్లు జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఈ పోటీలు శ్రీ సత్యసాయి జిల్లా హాకీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు రోజు ముఖ్య అతిథులుగా జేఆర్ సిల్క్స్ అధినేత, ధర్మవరం బిజెపి నాయకులు జింక రామాంజనేయులు, ఆర్ డి టి స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ విచ్చేసి క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించి హాకీ పోటీలను నాలుగవ రోజు ప్రారంభించారు. నాలుగవ రోజు జరిగిన హాకీ పోటీలలో తిరుపతి జిల్లా జట్టు విజేతగా నిలిచినట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంధనాదం సూర్యప్రకాష్ తెలిపారు. ఫైనల్ పోటీల్లో తిరుపతి సత్యసాయి జిల్లా జట్లు తలపడగా 4-1 గోల్డ్ తేడాతో తిరుపతి జట్టు విన్నర్స్ గా నిలవగా, శ్రీ సత్య సాయి జిల్లా జట్టు రన్నర్స్ గా నిలిచింది. మూడవ స్థానంలో విశాఖపట్నం జిల్లా ఎన్టీఆర్ జిల్లా పై షార్ట్ అవుట్లో విజయం సాధించిందని తెలిపారు. ఈ మేరకు ఆర్డిటి స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ హాకీ ఆంధ్రప్రదేశ్ సీఈఓ నిరంజన్ రెడ్డి అధ్యక్షులు చాణుక్యరాజులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల పట్ల కూడా రాణించాలని, క్రీడల్లో మంచి నైపుణ్యతను సాధించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతోమంది మంచి ఉన్నత స్థాయికి కూడా చేరుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. హాకీ క్రీడల్లో జాతీయ స్థాయిలో ఎదిగేలా మంచి సాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోశాధికారి థామస్, జిల్లా సహకార దర్శి అరవింద్ గౌడ్, ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు, కోశాధికారి థామస్ పీటర్, డైరెక్టర్లు అంజన్న, మారుతి, కిరణ్, అమినుద్దీన్, హాకీ కోచ్ హసేన్ తదితరులు పాల్గొన్నారు.