విశాలాంధ్ర -అనంతపురం : వృత్తి నందు నిబద్ధత, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,మంచినీళ్ళ బల రామారావు మరియు జీ . శ్రీధర్ బాబు, పోస్ట్ మాస్టర్ అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రిటైర్డ్, ఏ పి పీడీసీల్ మరియు ప్రెసిడెంట్ పి టీ సి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కోమలపాటి సుధాకర్ బాబు పేర్కొన్నారు. సోమవారం పి టి సి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పి టీ సి స్టేడియం నందు వాకర్స్ సభ్యులు మరియు ఆత్మీయ మిత్రులు పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రిటైర్డ్ సుధాకర్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ శ్రీ కోగటం విజయభాస్కర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర శేఖరరెడ్డి, ఎస్ ఎస్ ఏ ముఖ్య వక్తగా వ్యవహరినించి సభను దిగ్విజయంగా కొనసాగించారు. వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు ప్రొఫెసర్ సుధాకర్ బాబు-యస్ కె యు మాజీ రిజిస్ట్రార్, కృష్ణమోహన్, రాజు, శ్రీనివాసరెడ్డి, గాయత్రీ మిల్క్ డైరీ, శ్రీరాములు వారు పదవి విరమణ పొందిన బల రామారావు, శ్రీధర్ బాబు ఇరువురిని వారు డిపార్ట్మెంట్ కి ప్రజలకు చేసిన పనులను ఉద్దేశించి మాట్లాడినారు. వాకర్స్ సభ్యులు మాజీ ఏపీపీ నాగలింగం, ఆర్ ఐ ఓ రమణ, ఏపీజీబీ మేనేజర్ అశ్వార్తు, మాజీ టౌన్ బ్యాంక్ మేనేజర్ లోకనాథ్,రంగస్వామి, సత్య రామ్ పోలీస్ డిపార్ట్మెంట్, రామ్మోహన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ , వైవీ రమణ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇందిరా ప్రియదర్శిని హోటల్ ధనుంజయ బాబు, వెంకట రంగయ్య, లెక్చరర్ సాయినాథ్,ట్రాన్సకో సిబ్బంది రామలింగప్ప, రవీంద్ర, తదితరులు మంచినీళ్ళ బల రామారావు విధి నిర్వహనలో 40 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కి సేవలు అందించారని మరియు కరోనా సమయంలో అతని సేవలు మరువలేము అని కొనియాడారు.ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.