విశాలాంధ్ర-విశాఖ: సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు విశాఖ మురళీనగర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ అధ్యక్షత వహించారు. పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్ర సమితి సమావేశాలు మురళీనగర్లోని ఆహ్వాన ఫంక్షన్ హాల్లో జరగనున్నాయి.