London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

గంజాయి నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

. త్వరలో టోల్‌ ఫ్రీ నంబరు ప్రకటిస్తాం
. మంత్రులు అనిత, సంధ్యారాణి
. మంత్రివర్గ ఉప సంఘం తొలి భేటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించేందుకు ‘యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ ఫోర్స్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రివర్గ ఉప సంఘం వెల్లడిరచింది. త్వరలో ఒక ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ప్రకటిస్తామని తెలిపింది. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉప సంఘం చర్చించింది. రాష్ట్ర హోమ్‌, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉప సంఘంలో రాష్ట్ర మానవ వనరులు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. సమావేశం అనంతరం నాల్గవ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనిత, సంధ్యారాణి వెల్లడిరచారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో మాదక ద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైవారి భవిష్యత్తుకు, కుటుంబాలకు కూడా తీరని నష్టం జరుగుతుందన్నారు. గంజాయి పంటను నాశనం చేయడానికి రెండేళ్లుగా సెబ్‌కు ఎలాంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదని హోంమంత్రి అనిత చెప్పారు. గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టే, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అలవాటును నియంత్రించే డి-అడిక్షన్‌ కేంద్రాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాల దశ నుంచే విద్యార్థులకు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ కేసుల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నవారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరమని అనిత అన్నారు. గంజాయి సాగుకు పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, డిఫాల్ట్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చిన వారు ఎవరనే దానిపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా వంద రోజులలో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని, గంజాయి సాగుపై సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం నుంచి తగిన బహుమతులు అందజేస్తామని తెలిపారు. గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ… ప్రభుత్వం కేటాయించిన భూముల్లో గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే దుష్ప్రరిణామాలను గిరిజనులకు అర్థం అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో కాఫీ, అల్లం, చింతపండు, పసుపు వంటి పంటలను మాత్రమే సాగయ్యేలా చూస్తామన్నారు. ప్రలోభాలకు గురైన గిరిజనులు గంజాయి సాగు చేయడానికి గత ప్రభుత్వం ఐటీడీఏలను నిర్వీర్యం చేయడం కూడా ఒక కారణమని తెలిపారు.
గిరిజనులు వారి పిల్లలను మంచి పౌరులుగా తయారు చేసేందుకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లి దండ్రులు పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించాలని గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు గంజాయికి అలవాటుపడినట్లయితే… ఎలాంటి భయం లేకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని… వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన సహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ పాల్గొన్నారు. .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img