ఏపీ ఎస్ ఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఏపీఎస్ఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల పల్లెటూర్ల నుంచి చాలామంది విద్యార్థులు ఈ కళాశాలకు చదువుతున్నారని, కళాశాలకు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నది తినేసి వస్తున్నారని, మధ్యాహ్నం పూట్ల వస్తు ఉంటున్నారని తెలిపారు. డబ్బు ఉన్న విద్యార్థులు బయటకు వెళ్లి హోటల్లో తింటున్నారని తెలిపారు. ఈ కళాశాలలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెనివెంటనే మధ్యాహ్న భోజనం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, ఉదయ రెడ్డి ,పవన్ ,కిషోర్, రమేష్, స్వామి, నరేంద్ర రూపేష్ తదితరులు పాల్గొన్నారు.