తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కేశగాల్ల శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కేశగాల్ల శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు కేశగాల్ల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా ఈ సందర్భంగా పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎంతో కుల విపక్షత ఉన్న సమయంలో ఉన్నత చదువులు చదివి ,ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా ఎంపీగా 50 సంవత్సరాలపాటు ఎన్నిక కావడం ఆయన నాయకత్వానికి నిదర్శనం అని తెలిపారు.అలాగే ఆయన అనేక రాజ్యాంగ పదవులు ద్వారా దేశానికి అనేక సేవలు అందించడం జరిగింది అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ గా ఆయన అనేక రంగాలకు సేవలు అందించి, అందులో రాణించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొని అనేకమార్లు అరెస్టు కావడంతోపాటు , జైలుకి వెళ్లడం జరిగింది అని తెలిపారు. భారతదేశం లోని యువత ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిరాడ్డి బూదెప్ప, రామాంజనేయులు , దాసుగారి కుల్లాయప్ప మొండి శీన, సుబ్రహ్మణ్యం ,అంజి అదెప్ప ,నాగరాజు, నారాయణ, రామకృష్ణ ,పెద్దన్న ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.