విశాలాంధ్ర -ధర్మవరం : అండర్-19 చెస్ పోటీలకు ధర్మవరం బి ఎస్ కే చెస్ అకాడమీ క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని చీఫ్ కోచ్ ఆది రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల12,13,14 వ తేదీలలో నంద్యాలలో జరగబోవు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ వారు నిర్వహించే పోటీలకు ధర్మవరం వారు ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అండర్-19 బాలుర లో ఎస్. కేదార్నాథ్ రెండవ ప్లేస్ (3/4), పి హర్ష చైతన్య నాల్గవ ప్లేసు (3/4), పి సహస్ర అండర్-19 విభాగం బాలికల్లో నాలుగవ ప్లేసు (3/4) కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈనెల ఏడవ తేదీన హిందూపురంలో స్పార్టన్ చెస్ అకాడమీ నందు నిర్వహించిన శ్రీ సత్య సాయి జిల్లా ఓపెన్ పోటీలలో వీరు నంద్యాలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు నాలుగు మ్యాచ్లకు గాను మూడు మ్యాచ్లలో విజయం సాధించారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఈ ముగ్గురు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరి విజయం పట్ల బీఎస్పీ చెస్ అకాడమీ ముఖ్య శిక్షకులు ఆదిరత్న కుమారు ఇతర శిక్షకులు హర్షం వ్యక్తం చేశారు.