విశాలాంధ్ర ధర్మవరం:: యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఈనెల 13వ తేదీ శనివారం పెనుగొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సెట్టిపి జయ చంద్రారెడ్డి, సుధాకర్ పేర్కొన్నారు. తదుపరి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంటుకు కన్వీనర్ గా జిల్లా కార్యదర్శి నరేష్ వ్యవహరిస్తారని తెలిపారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా మండల పట్టణ జట్లు పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే అర్హత గలదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నారాయణస్వామి, రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, రాంప్రసాద్, చంద్రశేఖర్ ,సురేష్, రామాంజనేయులు, సాయి గణేష్, వెంకట కిషోర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.