తారక్ చేయుత ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాంజి
విశాలాంధ్ర ధర్మవరం:: అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉందని తారక్ చేయుత ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాజీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాజేంద్రనగర్ లో గల అనాధాశ్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ కుమార్తె నాట్య మయూరి నాట్య హంస సత్యభామ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన రామ లారీత్యా పుట్టినరోజు సందర్భంగా అనాధశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అనంతరం బట్టలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తారక్ చేయుట ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాజీ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా శ్రీ లలిత నాట్య కళానికేతన్ వారు ఈ సేవా కార్యక్రమం నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని కలిగించిందని, అనాధలకు కడుపునిండా భోజనం పెట్టడం ఎంతో పుణ్య కార్యమని తెలిపారు. అనంతరం బాబు బాలాజీ కు కృతజ్ఞతలను తెలియజేశారు.