విశాలాంధ్ర ధర్మవరం:: అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రావులచెరువు ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ గోపాల్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి దాదాపు 30 సంవత్సరాలు విద్యార్థులకు అక్షరాలు దిద్ది నటువంటి గోపాల్ ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని,సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని, ఎవరికి నొప్పించగా మెప్పించి తన 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూ చక్కటి విధులు కొనసాగించడం జరిగిందని తెలిపారు. వారి యొక్క శేష జీవితం సుఖశాంతలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల వద్ద మంచి చదువును పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, ఆ సమయం కొంత బాధ కలిగించిన, తన వృత్తికి పూర్తి న్యాయం చేశానన్న ఆత్మసంతృప్తి ప్రతి హృదయంలో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుడు తన బోధనతో పాటు, తన సబ్జెక్టు పట్ల నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే చదువుకు సార్థకం లభిస్తుందని, అప్పుడే విద్యార్థులు ఎంతో నైపుణ్యంతో పొందిన విద్యను పొందుతారని తెలిపారు. తదుపరి గోపాల్ ను ఎంఈఓ తో పాటు తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు.