. అతిపెద్ద పార్టీగా ఆవిర్భావం
. 188 పార్లమెంటు స్థానాలు కైవసం
. వారంలో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన
. ప్రభుత్వం ఏర్పాటునకు సిద్ధం న్యూ పాపులర్ ఫ్రంట్
పారిస్: ఫ్రాన్స్లో లెఫ్ట్ జయకేతనం ఎగుర వేసింది. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 188 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో సెంట్రల్ పారిస్లోని రిపబ్లిక్ స్క్వేర్ వద్ద వామపక్ష మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ‘మనం గెలిచాం! మనం గెలిచాం!’ అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ బాణాసంచా కాలిచారు. డ్రమ్ములు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన క్రమంలో ఆదివారం రెండవ రౌండ్ ఓటింగ్ జరిగింది. ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. లెఫ్ట్ అధ్వర్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 188 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. 32.6 శాతం ఓట్లు సాధించింది. మాక్రాన్ `సెంట్రిస్ట్ కూటమి 161 స్థానాలకు పరిమిత మైంది. 27.9శాతం ఓట్లు పొందింది. నేషనల్ ర్యాలీ కూటమికి 24.6శాతం ఓట్లు రాగా 142 స్థానాలు దక్కాయి. ఇక రిపబ్లికన్స్ (ఎల్ఆర్) 48 స్థానాల్లో గెలవగా 8.3శాతం ఓట్లు పొందింది. మిగతా పార్టీలు 38 స్థానాల్లో గెలిచాయి. 6.6శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 577 స్థానాలు ఉండగా మెజారిటీ సాధించా లంటే 289 స్థానాల్లో గెలవాలి. ప్రస్తుతం ఏ కూటమికి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత ఏర్పడిరది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని లెఫ్ట్కు ఇవ్వాలని ఫ్రాన్స్ అన్బౌడ్ (ఎల్ఎఫ్ఐ)కు చెందిన శక్తిమంతమైన నాయకుడు జీన్ లుక్ మెలెన్కోన్ డిమాండ్ చేశారు. ‘ఇది వామపక్ష సంకీర్ణం… చారిత్రక ఫలితాలు సాధించింది. లెఫ్ట్ తనదైన శైలిలో దేశాన్ని మరోమారు ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడిరది’ అని అన్నారు. కాగా, ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా ప్రకటిస్తామని ఎన్ఎఫ్పీ కూటమి లోని సోషలిస్టు పార్టీకి చెందిన నాయకుడు ఒలీవర్ ఫౌరె వెల్లడిరచారు. ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత సోషలిస్టులు, కమ్యూనిస్టులు, గ్రీన్ పార్టీ, లెఫ్ట్ అన్బౌడ్ ఏకతాటిపైకొచ్చి న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్ఎఫ్పీ)గా ఏర్పడ్డాయి. ఇదిలావుంటే ఈసారి రికార్డు స్థాయిలో 66.63 శాతం పోలింగ్ నమోదైంది.1981 తర్వాత అంటే నాలుగు దశాబ్దాలలో పోలింగ్ శాతం భారీగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రధాని రాజీనామా: అధ్యక్షుడి తిరస్కృతి
అధికార పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రధాని గేబ్రియల్ అట్టల్ రాజీనామాకు సిద్ధమ య్యారు. తన రాజీనామా లేఖను అందజేసేం దుకు అధ్యక్ష భవనానికి వెళ్లారు. అయితే అట్టల్ రాజీనామాను అధ్యక్షుడు మాక్రాన్ ఆమోదించ లేదు. దేశ సుస్థిరత దృష్ట్యా ప్రస్తుతానికి ప్రధాని పదవిలో కొనసాగాలని అట్టల్ను మాక్రాన్ కోరినట్లు అధ్యక్ష భవన వర్గాలు వెల్లడిరచాయి.