– యుటిఎఫ్ డిమాండ్
టిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సేట్టిపి జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు సెట్టీపీ జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎల్ సి కె పురం పాఠశాలలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్య, నూతన అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల పోస్టుల మంజూరు, బదిలీలు, ప్రమోషన్లు, మున్సిపల్ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా పోస్టుల సర్దుబాటు, జీవో నెంబర్ 117 తక్షణం రద్దు చేయాలని యుటిఎఫ్ తరపున వారు డిమాండ్ చేశారు. తొలుత వారు ధర్మవరం మున్సిపాలిటీ నందు ఉపాధ్యాయుల యుటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2016 లో ఇచ్చిన మునిసిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను సవరణ చేస్తూ, విద్యా శాఖ జీవో నెం. 7, 8, 9, 10 లను విడుదల చేసింది అని,ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ నిలచిపోవడం జరిగిందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఎఫ్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేకపోవడం దారుణం అన్నారు. నూతన మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీ పాఠశాలను కూడా మునిసిపల్ పాఠశాలలుగానే గుర్తించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు రామకృష్ణ నాయక్, ధర్మవరం యుటిఎఫ్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సాయి గణేష్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, రాంప్రసాద్, రామాంజినేయులు, హరి శంకర్, ఆంజనేయులు, మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.