కళాజ్యోతి అధ్యక్ష ,కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో(ఐ సి ఆర్ ఆర్ సరస్వతీ నిలయం) ఈనెల 13వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఆంధ్ర నాటక పితామహులు కీర్తిశేషులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వర్ధంతి సభను నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, రామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా.. కళాజ్యోతి సంస్థ అధ్యక్షులు కుంటిమల నారాయణ, ముఖ్యఅతిథిగా కీర్తిశేషులు రామకృష్ణమాచార్యుల వారి ముని మనవళ్లు సాయి లతా, సౌమ్య హాజరు అవుతున్నట్లు వారు తెలిపారు. తదుపరి ఇదే రోజు రాత్రి 7:30 గంటలకు 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ వేంకటేశ్వర సురభి థియేటర్-సురభి జయచంద్ర వర్మ, హైదరాబాద్ బృందం వారిచే ఈనెల 13వ తేదీ శనివారం భక్త ప్రహల్లాద పౌరాణిక నాటకము, 14వ తేదీ ఆదివారం పాతాళభైరవి జానపద నాటకములు ప్రదర్శించబడునని వారు తెలిపారు. కావున వర్ధంతి వేడుకలతో పాటు హైదరాబాద్ బృందం వారిచే నిర్వహించబడు ఈ నాటకములను అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి, ఆస్వాదించి, విజయవంతం చేయాలని వారు తెలిపారు.