విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న అశ్విని తన బ్యాగు పోగొట్టుకుపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వన్టౌన్ కానిస్టేబులు మారుతి, దివాకర్ విచారణ చేపట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే కుమారుడు యశోద స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న సందర్భంగా, పిలుచుకొని రావడానికి వెళ్లడం జరిగింది. తదుపరి పొరపాటున బ్యాగు కనపడకపోవడం జరిగింది. యశోద స్కూల్ కు చేరుకున్న మారుతి దివాకర్ లు టీచర్ ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేయగా, ఒక ఆటో వ్యక్తి వద్ద ఉన్నట్లు, అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పారు. అప్పటికప్పుడే ఆటో వద్ద చేరుకొని విచారించగా, ఆటో వ్యక్తి కూడా ఎవరో పోగొట్టుకున్నారు ఇవ్వాలని అనుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ బ్యాగు ని తీసుకొని పోలీస్ స్టేషన్లో అశ్విని టీచర్కు అప్పగించారు. ఈ సందర్భంగా అశ్విని మారుతీ కు ,దివాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో మానవతను చాటుకున్న పోలీసులను ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.