విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్ లో గల శ్రీనివాస డిగ్రీ పీజీ కళాశాలలో జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీఎస్ అండ్ టి ఎస్ ఆధ్వర్యంలో ఐసిఐసిఐ బ్యాంకు పరిధిలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 64 మంది విద్యార్థులు పాల్గొనగా 9మంది ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులకు బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ అభినందనలు తెలియజేశారు. అలాగే ఐసిఐసిఐ సీనియర్ గోపాలకృష్ణ ప్లేస్మెంట్ ఆఫీసర్ బాబా కళాశాల ప్రిన్సిపాల్ ముషల్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పుష్ప వాహనా రెడ్డి అధ్యాపకులు అధ్యాపకతర బృందం ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.