. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లాపరిషత్ గర్ల్స్ హై స్కూల్ లో చదివిన ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు హెచ్.ఎం.రామిరెడ్డి తెలిపారు. ఎంపికైన వారిలో ఎం.నేహ, జి.నాగలక్ష్మి లు నూజివీడుకు, టి.లీల, సాహితి, వై.యశ్వంతి, సత్య లు శ్రీకాకుళంకు, ఎస్.కల్పన ఒంగోలు ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించారని తెలిపారు. ట్రిపుల్ ఐటీ సాధించిన విద్యార్థులను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, స్నేహితులు అభినందించారు.