Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

కళాశాల ఆవరణములో 50 మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణములో “ఏక్ పేడ్ మాకే నామ్” అనే కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి డాక్టర్ బి గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి మోదీ పిలుపుమేరకు ఏ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కార్యక్రమ అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని దాదాపు 50 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. నాటిన మొక్కలలో రావి, టేకు, సీతాఫలం చింతా నేరేడు జామ, వేప, తదితర మొక్కలు ఉన్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఈ నాటిన మొక్కలను అమ్మలాగా చూసుకుంటూ వాటిని పరిరక్షిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు త్రివేణి, షమీవుల్ల ,చిట్టెమ్మ, కిరణ్ కుమార్, భువనేశ్వరి, పుష్పావతి,సరస్వతి, హైమావతి, అధ్యాపకేతర బృందము, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img