-తహశీల్దార్ టి.సీతారాం
విశాలాంధ్ర-రాప్తాడు : రానున్న రోజుల్లో మండలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని తహశీల్దార్ టి.సీతారాం ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం డీటీ సురేష్, ఈఓఆర్డీ నరసింహారెడ్డి, పీఆర్ జేఈ ఓబులదాస్, సీఎస్డీటీ జ్యోతి, సిహెచ్ఓ శివప్రసాద్, ఆర్ఐ హేమలత, వీఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామ స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ శిధిలావస్థలో ఉన్న భవనాలను, పాఠశాలలను గుర్తించి, ఆ ప్రదేశంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. వాగులు, వంకలు ప్రవాహ తీవ్రతను ముందుగానే గుర్తించి దండోరా రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. ప్రతిరోజు వర్షపాత నమోదును మండల స్థాయిలో తెలిసే విధంగా చూడాలన్నారు. రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నివేదికలను సంబంధిత పై అధికారులకు చేరయాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, వీఆర్ఓలు మనోలాల్ నాయక్, లక్ష్మయ్య, సరస్వతి, యశోద, రామాంజినేయులు, లింగారెడ్డి, రవి, రాజారెడ్డి, గౌతమి, గీత తదితరులు పాల్గొన్నారు.