విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో శుక్రవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ ఐదవ వార్డ్ ఇంచార్జ్ ఆదిశేషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డెంగ్యూ వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్మూలించాలంటే రాత్రి సమయాలలో దోమతెరలు కట్టుకొని నిద్రించాలన్నారు. తమ ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న నీటి ట్యాంకులను శుభ్రం ఉంచుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో సచివాలయ అడ్మిన్ నారాయణస్వామి అంగన్వాడి టీచర్ మధు సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.