Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రజలకు సేవలు చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యము..

మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్ సి.రమేష్ నాథ్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ సి.రమేష్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ధర్మవరంలోని ఎర్రగుంట్ల లోని లయన్స్ కంటి ఆసుపత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నూతన కార్యవర్గం కమిటీకి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ లో క్యాడర్ వైజ్ గా ఉన్నవారికి చేయవలసిన పనులు, లక్ష్యాలు, తదితర వాటిని వారు వివరించారు. అనంతరం నూతన కమిటీ వారిచే ప్రమాణ స్వీకారోత్సవాలను కూడా గవర్నర్ రమేష్ నాథ్ రెడ్డి చేయించారు. ఈ కార్యక్రమం గూడూరు మోహన్ దాస్ అధ్యక్షుల, సభ నిర్వహణ పిట్ట వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగాయి. తదుపరి వారు మాట్లాడుతూ ఇప్పటివరకు ధర్మవరంలోని లయన్స్ క్లబ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు పొందిందని, ఆ గుర్తింపును మరింత విస్తరింప చేసే బాధ్యత నూతన కార్యవర్గ కమిటీ పై ఆధారపడి ఉందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాలతో పాటు, వివిధ సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఇప్పటికే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్, ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ కూడా ఉచిత సేవలను పేద ప్రజలకు అందిస్తూ, వారి సమస్యల పట్ల పరిష్కార దిశకై ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. లయన్స్ కంటి ఆసుపత్రిలో షెడ్యూల్ తేదీల మాదిరిగా ఇప్పటికే పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, వైద్య చికిత్సలు, కంటి అద్దాలను ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలుపుతూ లయన్స్ క్లబ్ వారిని అభినందించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ లయన్స్ క్లబ్ ను వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి ఎంతో శ్రద్ధతో, అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ, ఆ కమిటీల ద్వారా ప్రజలకు వివిధ సేవలు చేస్తూ, క్లబ్బులో చేరిన వారందరికీ మంచి గుర్తింపు తెచ్చేలా అహర్నిశలు కృషి చేస్తూ, క్లబ్బుకు ఆదర్శమూర్తి కావడం జరిగిందని తెలుపుతూ, వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నూతన కమిటీ వారు, మాజీ కమిటీ సభ్యులు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమేష్ నాథ్ రెడ్డిని, కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి లను ఘనంగా సత్కరించారు. నూతన కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా వేణుగోపాలాచార్యులు కార్యదర్శిగా ఆకులేటి రమేష్ బాబు, కోశాధికారిగా ఉలవల నాగేంద్ర, మెంబర్షిప్ చైర్మన్గా వెంకటేష్ కుమార్, క్లబ్బు అడ్మిన్ స్టేటస్ గా జి. రాధాకృష్ణ ఎంపిక కావడం పట్ల వారు మరోసారి కృతజ్ఞతలను తెలియజేశా రు. తదుపరి నూతన కమిటీగా ఎంపిక కాబడిన వారి చేత ప్రతిజ్ఞ, ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో, దాతలతో, గతంలో పనిచేసిన లయన్స్ క్లబ్ కమిటీ, ప్రతినిధులతో లయన్స్ క్లబ్ ను మరింత అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. తదుపరి నూతన కమిటీ వారిని లయన్స్ క్లబ్ మాజీ కార్యవర్గం, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పళ్లెం వేణుగోపాల్, మేటి కల కుల్లయప్ప, గోసే రాధాకృష్ణ, ఉట్టి శివప్రసాద్, సాగా సురేష్, ముక్తాపురం కృష్ణ, గూడూరు రాజగోపాల్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img