ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డికి ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
ధర్మవరం మండలంలోని నాగులూరు గ్రామంలో ఉన్నటువంటి పీసీఎంఆర్ పాఠశాల వారు ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ ఉన్నారని,శుక్రవారం రోజున సాయంత్రం విద్యార్థులను ఇంటిదగ్గర వదలడానికి వెళుతున్న పిసిఎంఆర్ స్కూల్ బస్ ధర్మవరం పట్టణంలోని శివానగర్ దగ్గర బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది అని తెలిపారు. విద్యార్థుల నుండి వేలకు వేల బస్సు ఫీజులు వసూలు చేస్తూ, కనీసం బస్సు కండిషన్ కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. అదేవిధంగా బస్సు సీట్లకు అంటే అదనంగా విద్యార్థులను స్కూల్ బస్సులో విద్యార్థులను ఎక్కించుకుంటున్నారని, ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల వారు స్కూల్ బస్సులో సీట్ల కంటే ఎక్కువ మందిని స్కూల్ బస్సులో తీసుకెళ్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తొండడం సరైన పద్ధతి కాదని తెలిపారు. తక్షణమే అధికారులు తనిఖీ చేసి, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొండి నందకిషోర్, రవి, నాని సునీల్ తదితరులు పాల్గొన్నారు.