విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శివాలయం రోడ్డు శివానగర్లో (టీటీడీ కళ్యాణమండపం పక్కన) ఈనెల 25వ తేదీ గురువారం గురుపూజ మహోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నట్లు దాశెట్టి నారాయణస్వామి అండ్ సన్స్ వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గురు పూజ మహోత్సవ వేడుకలు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గురుపూజ మహోత్సవ వేడుకలు తల్లి కీర్తిశేషులు దాశెట్టి ఓబులమ్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.