విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు పై సి.డి.వి.ఎం. కమ్యూనిటీ వారి సద్భావన టీం ఆధ్వర్యంలో చోడవరం శివాలయం వద్ద కౌన్సెలింగ్ నిర్వహించారు. సద్భావన టీం సభ్యురాలు, స్థానిక సబ్ రిజిస్ట్రార్ గీతా లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
భిక్షాటన చేసేవారికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు మేధ అవగాహన కార్యక్రమంతో చేపట్టామన్నారు.
భిక్షాటన కాకుండా వివిధ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మీద బెగ్గర్స్ ఆలోచన చెయ్యాలి అని తెలిపారు.
బెగ్గర్స్ వారి అభిప్రాయాలు, ఆలోచనలు కూడా సద్భావ టీం తో పంచుకున్నారు. కొంత మంది భిక్షాటన వదిలి ఉపాధి కోసం వెళ్ళాలి అని తెలిపారు. అటువంటి వారికి అవకాశం కల్పించాలి అని సద్భావ టీం ఆలోచన చేస్తుందని అన్నారు.
ఎవరైనా వ్యాపారస్తులు ముందుకు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని సద్భావ టీం కోరింది.
మెరుగైన సమాజ కోసం … ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని, మంచి మార్గాలు వైపు అడుగులు వేయాలని సద్భావ టీం ఆశిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సి.డి.వి.ఎం.కమ్యూనిటీ ఫౌండర్ కొప్పాక రాజేష్, సద్భావన టీం సభ్యులు, శివాలయం ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతిరావు, దస్తావేజులు లేఖరి మురళీ తదితరులు పాల్గొన్నారు.