విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో గల అనాధ ఆశ్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతి,వెంకట రాముడు, వెంకటమ్మ దంపతుల జ్ఞాపకార్థం పార్వతి కుటుంబ సభ్యులు అనాధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని తెలిపారు. ఆశ్రమంలోనికి వృద్ధులకు ఇటువంటి కార్యక్రమం చేయడం మాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.