ఇరాన్ ధ్రువీకరణ
టెహ్రాన్/గాజా/దోహా/బీరుట్: ఇజ్రాయిల్ జరిపిన ప్రతీకార దాడిలో హమాస్ పొలిట్బ్యూరో అధ్యక్షుడు ఇస్మాయిల్ హనియే, ఆయన బాడీగార్డుల్లో ఒకరు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్సొ (ఐఆర్జీసీ) తెలిపింది. బుధవారం ఉదయం టెహ్రాన్లోని నివాసంలో ఇస్మాయిల్, ఆయన బాడీగార్డు హత్యకు గురైనట్లు ఒక ప్రకటన చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ దాడిలో తమ నాయకుడు హతమైనట్లు ఇస్లామిక్ హమాస్ మూవ్మెంట్ ధ్రువీకరించింది. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు తమ నేత ఇరాన్ వెళ్లినట్లు పేర్కొంది. గాజా స్ట్రిప్లో పలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య పోరునకు సంబంధించిన తాజా పరిణామాలపై ఇరాన్ నూతన అధ్యక్షుడితో చర్చించాలని ఆయన భావించినట్లు హమాస్ వర్గాలు తెలిపాయి.
ఉగ్ర ఘాతుకం: అలీ హౌతీ
ఇస్మాయిల్ హనీయే హత్యను హేయమైన ఉగ్ర ఘాతుకంగా హౌతీలు పేర్కొన్నారు. యెమన్కు చెందిన హౌతీల అత్యున్నత రాజకీయ మండలి సభ్యుడు మహమ్మద్ అలీ హౌతీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచారు. టెహ్రాన్లోని నివాసంపై ఇజ్రాయిల్ దాళాలు దాడికి తెగబడి ఆయనను హతమార్చినట్లు ఒక ప్రకటన చేశారు. చట్టాలు, నైతిక విలువలను ఇజ్రాయిల్ పూర్తిస్థాయిలో అతిక్రమించిందని, చట్టవిరుద్ధంగా, అనైతికంగా వ్యవహరించిందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
హెజ్బుల్లా, లెబనాన్ ప్రధాని ఖండన
హమాస్ పొలిట్బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనేయే హత్యను హెజ్బుల్లాతో పాటు లెబనాన్ ప్రధాని నజీబ్ మికతీ తీవ్రంగా ఖండిరచారు. ప్రాదేశికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పొంచివున్న ముప్పునకు ఇస్మాయిల్ హత్య సంకేతమని కేబినెట్ సమావేశంలో నజీబ్ ఆందోళన వ్యక్తంచేశారు. లెబనీస్ తీవ్రవాద సంస్థ, రాజకీయ పార్టీ హెజ్బుల్లా ఒక ప్రకటనలో ఇస్మాయిల్ హత్యను ఆక్షేపించింది. ప్రస్తుత శకంలో గొప్ప తిరుగుబాటు నేతల్లో ఒకరిగా ఇస్మాయిల్ను వర్ణించింది. అమెరికా హెగేమొనీ ప్రాజెక్టు, జియోనిస్ట్ దురాక్రమణను ధైర్యంగా ఎదుర్కొన్న నేతగా పేర్కొన్నది. ఇస్మాయిల్ హనేయే బలిదానంతో ప్రతిఘటన మరింత తీవ్రతరం చేస్తామని హెజ్బుల్లా సంకల్పించింది.
హింసను ఆక్షేపిస్తాం: చైనా
హమాస్ నేత ఇస్మాయిల్ హత్యను చైనా ఆక్షేపించింది. ఏ రూపంలోనూ హింసను తమ దేశం ప్రోత్సహించబోదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఒక ప్రకటన చేశారు. ప్రాదేశిక వివాదాలకు చర్చలతోనే పరిష్కారమన్నది చైనా ఉద్బోధ అని నొక్కిచెప్పారు. తాజా పరిణామం ఆందోళన కలిగించేదని, ప్రాదేశికంగా సుస్థిరత మరింత పెరుగుతుందని అభిప్రాయపడిరది. పోరు తీవ్రతరం కాకుండా గాజాలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
అనూహ్య పరిణామాలకు దారితీయొచ్చు: కేకేఈ
హమాస్ అగ్ర నాయకుడిని ఇజ్రాయిల్ హత్య చేయడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింతగా క్షీణించే ప్రమాదం ఉందని గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) హెచ్చరించింది. ఇజ్రాయిల్ నేరాలకు వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందులో గ్రీక్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరింది. సామ్రాజ్యవాద నేరాలను ఎదుర్కొంటున్న పలస్తీనా ప్రజలకు, లెబనాన్కు సంపూర్ణ సంఫీుభావం తెలపాలని పేర్కొంది. తమ వైఖరిని మార్చుకొని ఇజ్రాయిల్కు వంత పాడటం మానేయాలని గ్రీస్ ప్రభుత్వానికి కేకేఈ హితవు పలికింది.