. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం
. షూటింగ్లో మెరిసిన స్వప్నిల్
న్యూదిల్లీ : పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం వచ్చి చేరింది. యువ షూటర్ స్వప్నిల్ సత్తా చాటాడు. పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్లో మూడో స్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్… కీలక సమయంలో పుంజుకోవడం విశేషం. ఒక దశలో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగినప్పటికీ టాప్-3లోకి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగిచూడలేదు. చివరికి 451.4 పాయింట్లను సాధించి కాంస్యం అందుకున్నాడు. ఈ క్రీడాంశంలో చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ (461.3) రజతం కైవసం చేసుకున్నారు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ పోటీల్లో బోర్లా పడుకొని (ప్రోన్), మోకాళ్ల మీద (నీలింగ్), నిల్చొని(స్టాండిరగ్) షూటింగ్ చేయాలి. స్వప్నిల్ మొత్తం 451.4 పాయింట్లు సాధించాడు. అందులో మోకాళ్లపై షూటింగ్లో 153.5 పాయింట్లు, ప్రోన్ విభాగంలో 156.8 పాయింట్లు, స్టాండిరగ్లో 141.1 పాయింట్లను (స్టేజ్ 2 ఎలిమినేషన్తో కలిపి) సాధించాడు.
క్వార్టర్ ఫైనల్స్కు లక్ష్యసేన్
షటిల్ బ్యాడ్మింటన్లో 22 ఏళ్ల లక్ష్య సేన్ కార్వర్ ఫైనల్స్?కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ ఈవెంట్లో వరుస గేముల్లో భారత్కే చెందిన హెస్ఎస్ ప్రణయ్ను ఓడిరచాడు. 39 నిమిషాల పాటు సాగిన గేమ్లో 21-12, 21-6 తేడాతో ఓడిరచాడు.
డబుల్స్లో నిరాశ
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లో సాత్విక్రాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్స్లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్- వూ ఇక్పై ఓటమి చవిచూసింది.
ముగిసిన ఆర్చర్ల పోరాటం – పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఓటమి చవిచూశాడు. 0-6 తేడాతో వెంచావో (చైనా) గెలుపొందాడు.
ఇక బాక్సింగ్ లో నిఖత్కు షాక్ – బంగారు పతకంపై గురిపెట్టిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్లో నిఖత్పై 0-5 తేడాతో వుహు (చైనా) గెలుపొందింది. ఇక భారత పురుషుల హాకీ జట్టు తొలి ఓటమి చవిచూసింది. పూల్ బిలో బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 1-2 తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది.