ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఆఖరి టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ బెన్ డకెట్(27), జాక్ క్రాలే(79), ఒలీ పోప్(11), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0)లను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్లను ఈ చైనామన్ బౌలర్ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్గా నిలిచాడు.