—-తాను ప్రభుత్వం భూములు ఆక్రమించలేదు వైసిపి నేత సోమిరెడ్డికి ప్రశ్న
విశాలాంధ్ర:- మనుబోలు: నా పొలంలో ప్రెస్ మీట్ ఎలా పెడతారని మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామ వైసిపి నేత చెందులూరు శ్రీనివాసులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
మంగళవారం ఆయన కొమ్మలపూడి హైవే పొలంలో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డి స్థాయికి మరచి తనపై ఆరోపణలు చేశారని విమర్శించారు. 40 కోట్లు భూదోపిడికి పాల్పడ్డారని విమర్శించడం సమంజసం కాదని అన్నారు. గ్రామాల్లో జనాలను రెచ్చగొట్టి తన పొలంలో గట్టులు ధ్వంసం చేశారని అన్నారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వంలోని తనకు తన భూమికి సంబంధించి అడంగల్ ఉందని సాక్షా దారాలతో సహా చూపిస్తానని అన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు చేసిన తాను కోర్టు ద్వారా వెళ్లి తేల్చుకుంటానని హెచ్చరించారు. వీలైతే అభివృద్ధి చేయాలి కానీ అధికారం ఉందని ప్రత్యర్థులపై అనవసర ఆరోపణలు చేసే స్థాయి దిగజార్చుకోవద్దని హితవు పలికాడు. రిత్వంసం ఈ కార్యక్రమంలో మనుబోలు కో ఆప్షన్ ఆప్షన్ నెంబర్ నాగూర్, కరిముల్లా, రఘురామయ్య, మస్తానయ్య, బాలకృష్ణయ్య, హరిబాబు, కోటయ్య, పెద్ద ఎత్తున వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.