సీఎం సహాయ నిధికి రూ. 25 వేలు విరాళం
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : విజయవాడలోని వరద బాదితులకు పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అండగా నిలిచారు. గురువారం పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, శామ్యూల్ రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ తరుపున వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 వేలు నగదును అందజేశారు. అలాగే మరో రూ. 10 వేలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ కు వరద బాధితులకు కోసం రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ తరుపున అందజేస్తామని కరస్పాండెంట్ గోవిందరెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.