Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

ఉత్తరప్రదేశ్‌లో అమానవీయం..

గిరిజన యువకుడిపై దాడిచేసి.. నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు
నిందితుల్లో ఒకడి అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్రలో అమానవీయం జరిగింది. ఓ గిరిజన యువకుడిపై దాడిచేసిన కొందరు యువకులు అతడి తలపైనా, ముఖంపైనా, నోట్లోనూ మూత్రం పోసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. యువకుడిని కొడుతూ, తన్నుతూ దారుణంగా హింసించిన దుండగులు ఆపై మూత్రం పోశారు. ఈ వీడియోను షేర్ చేసిన బాధిత యువకుడి సోదరుడు శివకుమార్ ఖర్వార్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీని ట్యాగ్ చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడు పవన్ ఖర్వార్‌పై దాడిచేసిన అంకిత్, మరో ఏడుగురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. సెప్టెంబర్ 26న రాత్రి 8 గంటల ప్రాంతంలో శక్తినగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. బాధితుడు పవన్‌ను చుట్టుముట్టి దాడిచేసిన యువకులు చితకబాదారు. ఆపై వారిలో ఒకడు బాధితుడిపై మూత్రం పోశాడు. తనను వదిలేయాని పవన్ వేడుకోవడం ఆ వీడియోలో వినిపించింది. అతడి అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోని నిందితులు అతడిపై మూత్రం పోస్తూ ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అంకిత్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఇలాంటి ఘటన జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img