విశాలాంధ్ర – అనంతపురం : డాక్టర్ వినోద్ కుమార్, ఆల్ ఇండియా రేడియో లైవ్ ప్రోగ్రాం నందు” అనంత మిత్ర “కార్యక్రమం ప్రతి మొదటి మరియు మూడవ గురువారం ఉదయం 7:45 నుండి 8.15 నిమిషాల వరకు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది .ఈ నిర్ణయం లో భాగంగా గురువారం అనగా సెప్టెంబర్ మూడవ తేదీ, ఉద్యాన పథకాలు మరియు సాగు పథకం పైన రైతులకి అవగాహన కల్పించాలని కలెక్టర్ వారు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం పాల్గొనడం జరిగింది. జిల్లా నందలి సుమారుగా 13 మంది రైతులు కలెక్టర్ వారితో తమ యొక్క సమస్యలను మరియు సందేహాలను తెలియజేసి కలెక్టర్ ద్వారా సందేశం నివృత్తి పొందడం జరిగింది, ఇకనుండి ప్రతి మొదట మరియు మూడవ గురువారం వివిధ ప్రభుత్వశాఖల గురించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుమారి వినూత్న ,జిల్లా ఉద్యాన అధికారి నరసింహారావు జిల్లా ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ ఏపీఎపి ఎపిడి ఫిరోజ్ ఖాన్ రాప్తాడు ఉద్యాన అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు.