విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో దేవరకొండ గోవిందు (60) ను భార్య అంజనమ్మ గురువారం మధ్యాహ్నం రోకలిబండతో అతి దారుణంగా హత్య చేసింది. వివరాలకు వెళితే మృతుడు గోవిందు, భార్య అంజనమ్మ గత కొన్ని సంవత్సరాలుగా సాఫీగా సంసారం కొనసాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల కిందట వేరే మహిళతో మృతుడు గోవిందు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ప్రతిరోజు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడేవారు. భార్య పలుమార్లు అక్రమ సంబంధం పెట్టుకోవడం పద్ధతి కాదని, మానుకోవాలని తెలిపింది. కానీ భర్త లో మార్పు రాకపోవడంతో, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న భర్తపై అంజనమ్మ రోకలి బండితో పలుమార్లు తల పైన కొట్టడంతో, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ఇంట్లోనే చనిపోయాడు. స్థానికులు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా, టూ టౌన్ సీఐ ఇంచార్జ్ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనను ఆరా తీసి, కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు వారు తెలిపారు. మృతునకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలదు. ఈ హత్య గ్రామంలో సంచలనం కలిగించింది. సీఐ పలు కోణములలో విచారణ చేపడతామని తెలిపారు.