విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుపబడుతున్న విద్యార్థి డిగ్రీ కళాశాలలో మంగళవారం డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ ముద్దుబిడ్డ, పద్మ విభూషణ్, భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థులందరికీ ఆదర్శప్రాయులు అని,క్అందుకే ఆయన జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కలాంని ఆదర్శంగా తీసుకుంటున్నామని చిరు కవితల ద్వారా తెలియజేశారు.
ఓ కలాం…. నేటి విద్యార్థులం,
భావి భారత పౌరులం,
మీ పుస్తక పాఠకులం,
కలలను సాధించే శోధకులం,
మీ బాటలో నడిచే ప్రయాణికులం,
కర్తవ్యాలను నెరవేర్చే కార్యశూరులం,
మీ ప్రయోగాలను వీక్షించే వీక్షకులం,
అంటూ విద్యార్థులు తమ యొక్క విజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, వేచలపు అర్జున రావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అదట్రావు రామారావు, మేడిశెట్టి శంకర్, చీపురుపల్లి దేముడు నాయుడు, మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.