విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : తెలుగుదేశం పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని టీడీపీ యువనాయకులు రామకృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని బసలదొడ్డి, నాగలాపురం, చిన్నతుంబలం గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ యువనాయకులు రామకృష్ణారెడ్డి, టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా బసలదొడ్డి గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే నాగలాపురం, చిన్నతుంబలం గ్రామాలలో రూ. 10 లక్షల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేస్తే కూడమి ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కూటమి ప్రభుత్వంతో గ్రామాలకు మహర్ధశ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనాథ్, ఎంపీడీఓ జయరాముడు, పంచాయతీ రాజ్ ఏఈ ఖాదర్ బాషా, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీఓ ఖాదర్ బాషా, ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయకుమారి, టీడీపీ నాయకులు వీరేష్ గౌడ్, శివ, నర్సింహులు, ఏక్ హనుమంతు, చంద్రశేఖర్, మహాదేవ, చంద్ర, తిక్కయ్య, బద్రి తదితరులు పాల్గొన్నారు.