విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సామాజిక తనిఖీ కోసం పంట నమోదు జాబితాను మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ వారు వేసిన పంటలు, సర్వే నెంబర్, నీటి సదుపాయం మొదలగు వివరాలు పరిశీలించుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఈనెల 16 లోగా రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియచేయాలని వారు రైతులను కోరారు. సామాజిక తనిఖీ అనంతరం 19 న తుది జాబితా తయారు చేయటం జరుగుందన్నారు. తుది జాబితాలో ఎటువంటి మార్పులు చెయ్యటం కుదరని కారణంగా ఇప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే తుది జాబితా అనంతరం అక్నాలెడ్జిమెంటు కాపీలు తీసుకోవాలని తెలిపారు.
తుఫాను హెచ్చరికలు కారణంగా రైతుల రాబోయే రెండు రోజులు జాగ్రత్త వహించాలని పంట కోతలు వాయిదా వెయ్యటం, పంటచేలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవటం, నూర్పిడి చేసిన పంటను తార్పలీన్లతో కప్పివుంచటం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సబ్సిడీ శనగ విత్తనాలకోసం రైతు సేవకేంద్ర సిబ్బందిని సంప్రదించాలన్నారు.