మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్
విశాలాంధ్ర శింగనమల : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన విధంగా రాబోయే నాలుగు రోజులు అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నందువలన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్ తెలిపారు
వేరుశనగ పంట కోత దశలో ఉన్నందున, పంట కోతను వర్షాలు తగ్గేంత వరకు ఉండాలన్నారు, పంట కోత జరిగి ఉంటే వర్షానికి తడవకుండా టార్పాలిన్ పట్టలతో ఎత్తయిన ప్రదేశంలో కప్పి ఉంచాలని,లేదా పచ్చి కట్టే నూర్పిడి యంత్రాల ద్వారా పంట నూర్పిడి చేయాలని,పత్తి పంట కోత దశలో వుందని, వర్షానికి తడవకుండా పత్తి తీసివేయాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంటలను కాపాడుకోవాలని కోరారు