. కెమికల్ సంపూ శుద్ధి చేసే క్రమంలో సంపులో పడి ఇద్దరు కవల యువకులు మృతి
. వారిని పైకి తీసే క్రమంలో మరో కార్మికుడు అస్వస్థతకు గురి
విశాలాంధ్ర -కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల సబూరి ఫార్మా కెమికల్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది.బుధవారం జీడిమెట్ల ఇండస్ట్రీయల్ పరిధి మూసిఉన్న సబూరి ఫార్మా కెమికల్ కంపెనీలో కెమికల్ సంపు శుద్ధి చేసే క్రమంలో సాదు నారాయణ రావు అనే వ్యక్తి ఆ కంపెనీలో ప్యాబిరికేషన్ కాట్రాక్ట్ చేపత్తగా, అతనితో డైలీ లేబర్ గా పనిచేస్తున్న కవలలు 32 రాము, లక్ష్మణ్ లు ఒకరు సంపును క్లిన్ చేసే సమయంలో అందులో జారీ పడగా,అతడిని కాపాడే క్రమంలో మరొకరు అందులోకి పడి ఇరువురు కవల యువకులు మరణించారు. వీరిని బయటకు తీసేందుకు యత్నించిన మరొక కార్మికుడు అందులోకి దిగి తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతున్నాడని సమాచారం.
మూతపడిన కంపెనీని ప్యాక్టరీ స్ ఇన్స్పెక్టర్ అనుమతి లేకుండా ఫార్మా కెమికల్ రి ఇన్నోవేషన్……..
ఫార్మా కంపెనీ ఓనర్ లు, కిషోర్ రెడ్డి, సతీష్ రెడ్డిల నిర్లక్ష్యంతోనే కవల నిండు ప్రాణాలు బలి………
మూతపడిన సబూరి ఫార్మా కంపెనీలో ప్యాక్టరీస్ అప్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ లేకుండానే కంపెనీని రి ఇన్నోవేట్ చెయడం అలాగే, అవగాహన లేని కార్మికులతో కంపెనీ కెమికల్ సంపు అయినటువంటి వ్యక్యూమ్ జెట్ ట్యాంక్ లో కెమికల్ ఉందనే విషయం క్లినింగ్ వెళ్లిన కార్మికులకు తెలియపర్చకుండా రెండు నిండు ప్రణాలను బలిగొన్నారు. చనిపోయిన ఇద్దరు కవల యువకులు కెమికల్ ట్యాంక్ లో పడ్డ అనంతరం వారి నోట్లోకి కెమికల్ నీరు వెళ్లి ఊపిరి తీత్తులు చెడిపోయి మరణించి ఉంటారని,అట్టి నీటిని ల్యాబ్ టెస్ట్ కొరకు పంపినట్లు, అలాగే జీడిమెట్ల స్టేషన్ డిఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ ఆప్ ప్యాక్టరీస్ ఇండస్ట్రీస్ నితిన్ కుమార్ ను ప్రమాదంపై వివరణ కోరగా సబూరి ఫార్మా కెమికల్ కంపెనీ గత కొన్ని నెలలుగా మూసి ఉందని, అట్టి ఫార్మా కంపెనీ రి ఇన్నోవేషన్ కొరకు మా దగ్గర నుండి ఎటువంటి అనుమతి లేదని అట్టి కంపెనీపై దర్యాప్తు చేసి భాద్యులపై చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు.