విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని టీడీపీ నియోజకవర్గ యువనాయకులు రామకృష్ణారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆది కవి అన్నారు. కూటమి ప్రభుత్వం వాల్మీకి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వాల్మీకులు అందరూ ఐక్యంగా మన సమస్యల పరిష్కారం కోసం పోరాడినప్పుడే పరిష్కారం అవుతాయన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేది ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడలలో నడవాలని కోరారు. అనంతరం వాల్మీకి చిత్రపటాన్ని గ్రామ పురవీదుల గుండా మేళతాలతో ఊరేగించారు. అలాగే వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర రెడ్డి, రవిచంద్రా రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, చంద్రశేఖర్, యల్లప్ప వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలలో టిడిపి నాయకులు ఏసేపు, మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, విజయ్ కుమార్, వాల్మీకి సంఘం నాయకులు ఆంజనేయ, తలారి అంజి, ఓబులేశు, ఈరన్న, దస్తగిరి, రామాంజనేయులు, వీరాంజనేయులు,శాంతి మూర్తి అధిక సంఖ్యలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.