గ్రూపు-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ మిగిలింది.. ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. అభ్యర్థులు ఇవాళ డివిజన్ బెంచ్కు వెళ్లారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది.. మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన ఈ సమయంలో ఈ పిటిషన్ ను స్వీకరించలేమని డివిజన్ బెంచ్ పేర్కొంది.. ఈ కారణంగా పిటిషన్ ను పాస్ ఓవర్ చేస్తునట్లు తెలిపింది.
సుప్రీంకోర్టులో మరో పిటిషన్
హైకోర్టు తీర్పుపై గ్రూప్- 1 అభ్యర్ధులు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. తమ అభ్యర్థనను సరిగా పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
21 నుంచి మెయిన్స్ పరీక్షలు
ఇదిలా ఉంటే ఈనెల 21నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది.