కర్ణాటక కు వెళ్తున్న మద్యం బాబులు
విశాలాంధ్ర చిలమత్తూర్ రూరల్ (సత్యసాయి జిల్లా) : కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు నాణ్యమైన మద్యం పాలసీ అందిస్తామని చెప్పిన మాట ప్రకారం హామీ నిలబెట్టుకోవడానికి కొత్త మద్యం పాలసీ ఇటీవల ప్రవేశపెట్టారు, అయితే కొత్త మద్యం పాలసీలో కిక్కు ఎక్కడం లేదని కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్నారు మందుబాబులు. ఈ నేపథ్యంలో కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు చేసుకున్న వారు వ్యాపారాలు లేక వెలవెల బోతున్నారు, ధరలలో పెద్దగా తేడా లేదు అందులోనూ మద్యంలో కిక్కు ఎక్కడం లేదంటూ మద్యం బాబులు లబోదిబోమంటున్నారు. కొత్త మద్యం పాలసీ ఎప్పుడు అమలు అవుతుంది అంటూ గత రెండు నెలలుగా ఎదురుచూసిన మద్యం బాబులకు నిరాశే ఎదురైనది. కూటమి ప్రభుత్వం రూ 99 కె క్వాటర్ బాటిల్ అంటూ కొత్త మద్యం పాలసీ తెచ్చిన ఆ ఉసే లేకుండా పోయిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మద్యం ధరల్లో గతంలో కన్నా పెద్ద వ్యత్యాసం లేదంటున్నారు మద్యం ప్రియులు, ఏది ఏమైనాప్పటికీ మద్యం ప్రియులపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.