ఒకరు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.23.10.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర మంగళవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దాడి రాము (33) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. అనకాపల్లి నుండి వస్తున్న ఏ.పి.39 విసి 7796 నెంబర్ గల ఆటోని వెంకన్నపాలెం జంక్షన్ నుండి అనకాపల్లి వైపు వెళ్తున్న ఏపి 30 వి 3841 నెంబర్ గల ఒక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు ఇద్దరికీ బలమైన గాయాలవ్వగా, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన ఇద్దరు వ్యక్తులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి వైద్యం కోసం 108 లో తరలించారు. క్ చనిపోయిన ఆటో డ్రైవర్ దాడి రాము s /o సూర్య ప్రకాష్ రావు ది చీడికాడ మండలం బి. సింగవరం గ్రామామ. మరియు ఆటో లో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన శరగడం లక్ష్మి, శరగడం పూర్ణ చంద్ర రావు లకు బలమైన గాయాలు అయ్యాయి. దీనిపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.