డి సి హెచ్ ఎస్ రవికుమార్ విశాలాంధ్ర శింగనమల మండల కేంద్రంలోనిప్రభుత్వ ఆసుపత్రిని బుధవారండిసిహెచ్ఎస్ రవికుమార్ ఆకస్మికతనిఖీ నిర్వహించారు, ఆస్పత్రిని కలియతిరిగి అటెండెన్స్ రిజిస్టర్ ను, రక్త పరీక్షల గది, ఎక్స్ రే, ఈసీజీ ల్యాబ్ లను, క్షుణ్ణంగా పరిశీలించారు,
ఆస్పత్రికి వచ్చిన రోగులు పట్ల అశ్రద్ధ వహించకూడదని,
రోగులకు సరైనచికిత్స అందించేందుకే మనం డాక్టర్ వృత్తిని చేపట్టామని, ఓర్పు సహనంతో ట్రీట్మెంట్ చేయాలన్నారు, రాత్రి పగలు డాక్టర్లు ఖచ్చితంగా డ్యూటీ చేయాలని సూచించారు,డాక్టర్ సూచించిన విధంగా ఈసీజీ, ఎక్స్ రే, తీసి పరీక్షించి సక్రమమైన వైద్యం అందించాలన్నారు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం లు సిబ్బంది, రోగులకు సక్రమమైన చికిత్స చేయాలని, రోగుల నుండి డబ్బులు రూపంలో ఏ విధమైన వసూళ్లకు పాల్పడరాదని సూచించారు, ఎవరు చేసే పని వారే చేయాలని, ఏ వ్యాధికి ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలని, వారే అనంతపూర్ రెఫర్ చేస్తే వారు వైద్యంపై నిర్లక్ష్యం వహించిన వారు అవుతారని, స్పెషలిస్ట్ డాక్టర్ మెరుగైనవైద్యం అందించాలని, సాధ్యమైనంత వరకు రోగులను మరొక చోటికి రెఫర్ చేయరాదని, చీటికిమాటికి అనంతపురం ఆస్పత్రికి అంబులెన్స్ లో పంపిస్తున్నారని, ఈ విధమైనటువంటి ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు, ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీలో ఉన్నవారు, చికిత్స అందించలేక, అంబులెన్స్ లో పంపిస్తున్నారని సూచించారు, ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు