Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఆధార్ శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోండి

–ఎంపీడీవో గీతవాణి
–ఆధార్ కేంద్రం అకస్మిక తనిఖీ

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రతి ఒక్కరూ ఆధార్ శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో గీతవాణి అన్నారు. గురువారం స్థానిక సచివాలయ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గ్రామ సచివాలయ కేంద్రాలలో ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆధార్ కార్డులు ఎన్రోల్ , బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు, బయోమెట్రిక్‌ సమస్యలు, అప్‌డేషన్‌ వంటి వాటికోసం ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు, విద్యార్థులు నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, ఆధార్‌ సమస్యలు పరిష్కరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శిలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img