Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన గ్రంథె వెంకట అభిశిక్త్

విశాలాంధ్ర -ధర్మవరం ; స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన అండర్ 17 హా కీ పోటీలలో రూపా రాజా పిసి ఎంఆర్ పాఠశాల విద్యార్థి గ్రంధే వెంకట అభిషిక్త్ (పదవ తరగతి) ప్రతిభ కనబరిచి, నెల్లూరులో నవంబర్ 3 నుంచి జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అనంతపురం జట్టు తరపున ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ హాకీ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img